ఆ ఉత్తరాలను కేసీఆర్ బయటపెట్టాలి: కిషన్ రెడ్డి

by Disha Web Desk 2 |
ఆ ఉత్తరాలను కేసీఆర్ బయటపెట్టాలి: కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ తన తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని కలలు కంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన ప్రచారంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశమివ్వరని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకు ఓ ముఖ్యమంత్రి మారుతారని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ బీసీలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు.

కాంగ్రెస్.. తెలంగాణను సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు. ఐదు నెలల క్రితం కర్ణాటకలో గెలిచి ఆ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అవినీతిమయం చేసిందన్నారు. బొగ్గు నుంచి హెలికాప్టర్ల వరకు కుంభకోణాలకు పాల్పడిన కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించారని ఆయన వెల్లడించారు. కేసీఆర్ కుటుంబానికి అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీ కోసం వందలాది ఉత్తరాలు రాశానని కేసీఆర్ చెబుతున్నారని, వాటిని బయటపెట్టాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్వింటాల్‌కు రూ.1000 అదనంగా చెల్లించి రైతుల వద్ద నుంచి వడ్లు కొనుగోలు చేస్తామని వెల్లడించారు.

Next Story

Most Viewed