కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి కాసాని.. ముహూర్తం ఖరారు!

by Disha Web Desk 2 |
కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి కాసాని.. ముహూర్తం ఖరారు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కారెక్కనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి ఫార్మ్ హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. భద్రతా పరమైన కారణాల దృష్ట్యా పరిమిత సంఖ్యలో తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయంతో అసహనానికి గురైన కాసాని ఇటీవలే టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్‌లో చేరితే గోషామహల్ టికెట్‌ను కాసానికి ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి.



Next Story

Most Viewed