బీఆర్ఎస్‌లో చేరిన జిట్ట, మామిళ్ల.. కేటీఆర్ ఎమోషనల్ కామెంట్స్

by Disha Web Desk 2 |
బీఆర్ఎస్‌లో చేరిన జిట్ట, మామిళ్ల.. కేటీఆర్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత జిట్ట బాలకృష్ణారెడ్డి, టీఎన్‌జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో వారికి బీఆర్ఎస్‌ కండువా కప్పి మంత్రి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. జిట్టా బాలకృష్ణా రెడ్డికి పునరాగమన శుభాకాంక్షలు చెప్పారు. బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్‌లో చేరడం దారి తప్పిన కొడుకు తిరిగి ఇంటికి చేరుకున్నట్టు ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఉద్యమకారులంతా సొంత గూటికి చేరడం సంతోషంగా ఉందని అన్నారు.

అందరం కలిసి కష్టపడి తెచ్చిన తెలంగాణను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళే మనకు ఇవాళ నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. డబ్బు సంచులతో పట్టుబడ్డ రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ను గన్ పార్కు దగ్గరకు రమ్మని సవాల్ చేస్తున్నారు. నవ్వాలో.. సావాలో అర్ధం కావడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఉద్యమకారులను అమర వీరులుగా మార్చిన వారే అమరవీరుల స్థూపం దగ్గరకు రమ్మంటున్నారని సెటైర్ వేశారు. మళ్లీ తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతోంది.. ఉద్యమ కారులు ఏ పార్టీలో ఉన్నా తెగువ ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. వచ్చే 40 రోజులు చాలా కీలకమని.. అందరం కలిసిగట్టుగా పనిచేస్తే బీఆర్ఎస్‌కు తిరుగులేదని చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed