షర్మిల ఎవరో నాకు తెలియదు.. రాజశేఖర్ రెడ్డి బిడ్డ అయితే పెద్ద తోపా?

by Disha Web Desk 2 |
షర్మిల ఎవరో నాకు తెలియదు.. రాజశేఖర్ రెడ్డి బిడ్డ అయితే పెద్ద తోపా?
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలపై ఎమ్ఐఎమ్ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఎమ్ఐఎమ్ ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేసిన చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. షర్మిల ఎవరో తనకు తెలియదని.. ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయడం లేదో కూడా తెలియదని చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అయితే పెద్ద తోపా.. ఎవరేమిటనేది ప్రజలు నిర్ణయిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని కూటములు కట్టినా.. కుట్రలు చేసినా.. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో శాంతి సామరస్యాలు ఉండాలంటే అది కేవలం బీఆర్ఎస్ వల్లే సాధ్యమని చెప్పారు.


ఎమ్ఐఎమ్ పోటీ చేసే తొమ్మిది నియోజకవర్గాల్లో ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్‌తో ఫ్రెండ్లీ పోటీ అయినా.. జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపీనాథ్, రాజేంద్రనగర్‌లో ప్రకాశ్ గౌడ్‌ను ఓడిస్తామని అసదుద్దీన్ చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో కిషన్ రెడ్డి ఎందుకు పోటీ చేయడం లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అంబర్‌పేట నుంచి కిషన్ రెడ్డి పారిపోయారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ మద్దతు పూర్తిగా కాంగ్రెస్‌కే ఉంటుందని షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దనే ఉద్దేశంతోనే తాము పోటీ నుంచి తప్పుకుంటున్నామని, భేషరతు మద్దతు కాంగ్రెస్‌కే అని షర్మిల స్పష్టం చేశారు.

Next Story

Most Viewed