రేపు హైదరాబాద్‌కు కాంగ్రెస్ కీలక నేత.. రేవంత్, భట్టితో భేటీ!

by Disha Web Desk 2 |
రేపు హైదరాబాద్‌కు కాంగ్రెస్ కీలక నేత.. రేవంత్, భట్టితో భేటీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం రేపు హైదరాబాద్‌కు రానున్నారు. సికింద్రాబాద్‌లోని హరిహర కళా భవన్‌లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ హక్కుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అనంతరం తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలపై ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ మైనారిటీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ అనిల్ థామస్, ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మధుయాష్కి సహా తదితరులు పాల్గొననున్నారు.



Next Story