మద్యం షాపులు మూసివేయాలని EC ఆదేశం

by Disha Web Desk 2 |
మద్యం షాపులు మూసివేయాలని EC ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణాలో ఈ నెల 30వ తేదీన జరుగనున్న ఎన్నికల దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రచార పర్వం మంళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ క్రమంలో 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులను మూసివేయాలని ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా వైన్ షాపులను తెరిచినా, అక్రమంగా మద్యం రవాణా చేసినా, కఠిన చర్యలు తీసుకుంటామని ఎలక్షన్ కమిషన్ హెచ్చరించింది. అక్రమమద్యం రవాణాపై నిఘా పెట్టాలని ఎక్సైజ్ అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Next Story

Most Viewed