- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కోరుట్లలో నాకూ ఫ్రెండ్స్ ఉన్నారు.. MP అర్వింద్కు బీజేపీ నేత స్వీట్ వార్నింగ్!
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డివి అవగాహన లేని వ్యాఖ్యలని శేరిలింగంపల్లి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న బీజేపీ నేత యోగానంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమాజిగూడలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్కు చెందిన ఎంపీ అర్వింద్ శేరిలింగంపల్లి సీటు విషయంలో రాజకీయాలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. కోరుట్లలో తనకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారని, ఏం చేయాలో తనకు తెలుసని వ్యాఖ్యానించారు. తనకు శేరిలింగంపల్లి అసెంబ్లీ టికెట్ ఇవ్వకుంటే కాంగ్రెస్ను గెలిపించినట్లే అవుతుందని యోగానంద్ వెల్లడించారు. అసెంబ్లీ టికెట్ ఇవ్వకుంటే చేవెళ్ల పార్లమెంట్ సీటు అడుగుతానని యోగానంద్ చెప్పారు. ఇదిలా ఉండగా కొండా చేవెళ్ల పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. తన సీటు విషయంలో వేలు పెట్టినందుకే యోగానంద్ కొండా సీటు విషయంలో వేలు పెడుతున్నారనే చర్చ జరుగుతోంది. కాగా అర్వింద్ కోరుట్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.