రెచ్చగొట్టేలా ప్రసంగం.. రాజాసింగ్‌పై కేసు నమోదు

by Disha Web Desk 2 |
రెచ్చగొట్టేలా ప్రసంగం.. రాజాసింగ్‌పై కేసు నమోదు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగం చేశాడని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాజాసింగ్ గోషామహల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఈనెల 14న మహారాజ్ గంజ్ అగర్వాల్ భవన్ వద్ద జరిగిన బహిరంగ సభలో రాజాసింగ్ హిందూ యువతులు, లవ్ జిహాదీల మధ్య కొన్నేళ్లుగా పోరాటం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఇది రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయంటూ మంగళ్ హాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ట్విట్టర్ లోని హిందుత్వ వాచ్ పేజీలో ఉన్నాయని ఉన్నాయని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.



Next Story

Most Viewed