Y S Sharmila: రుణమాఫీ చేస్తానన్న కేసీఆర్ మోసం చేశారు...

by Dishafeatures2 |
YSRTP Chief YS Sharmila Visits Flood Affected Areas In Khammam
X

దిశ, వెబ్ డెస్క్: రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామన్న కేసీఆర్ మోసం చేశారని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల విమర్శించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. దొర తీరుతో రాష్ట్రంలో రైతుల బలవన్మరణాలు పెరుగుతున్నాయని, తొమ్మిదేండ్లలో దాదాపు 9వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ లో 2018 నుంచి ఇప్పటి వరకు రూ.26వేల కోట్లు వ్యవసాయానికి కేటాయించారని, దొర ఖర్చు చేసింది కేవలం రూ.1200 కోట్లు మాత్రమేనని తెలిపారు.

మహానేత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడాదిలోనే రుణమాఫీ చేసి చూపించారన్న షర్మిల.. దొర మాత్రం నాలుగేండ్లు దాటినా ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. మాట ఇస్తే తలనరుక్కుంటానని చెప్పిన కేసీఆర్ సారూ ఎక్కడాక అని ప్రశ్నించారు. రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, తక్షణమే ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.


Next Story