Saichand సాయిచంద్ మృతి పట్ల వైఎస్ షర్మిల సంతాపం

by Dishafeatures2 |
Saichand సాయిచంద్ మృతి పట్ల వైఎస్ షర్మిల సంతాపం
X

దిశ, వెబ్ డెస్క్: గాయకుడు సాయిచంద్ మృతి పట్ల వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. తన ఆట పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని పల్లె పల్లెకు,ప్రజల గుండెలకు చేర్చిన గొప్ప గాయకుడు సాయిచంద్ అని ఆమె కొనియాడారు. ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మరణం తనన తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. సాయిచంద్ భౌతికంగా మన మధ్య లేకున్నా తన పాట రూపంలో అందరి గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారని చెప్పారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరుకుంటూ .. ఆయన కుటుంబ సభ్యలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.



Next Story

Most Viewed