వై.ఎస్. వివేక కేసు.. సుప్రీం కోర్టుకు సునీత

by Disha Web Desk 6 |
వై.ఎస్. వివేక కేసు.. సుప్రీం కోర్టుకు సునీత
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణను వాయిదా వెయ్యటాన్ని సవాల్ చేస్తూ సునీత సుప్రీం కోర్టులో తాజాగా పిటిషన్ వేసారు. దీనిని స్వీకరించిన సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ జరుపనుంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణకు రావాలని ఇటీవల సీబీఐ నోటీసులు ఇవ్వగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.

దీనిపై రెండు రోజులపాటు విచారణ జరిపిన హైకోర్టు ఈనెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చెయ్యవద్దంటూ సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ సునీత గురువారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై వెంటనే విచారణ పూర్తి చేసి ఉత్తర్వులు జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అదే విధంగా ఈనెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చెయ్యవద్దన్న హైకోర్టు ఆదేశాలపై ఆమె పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed