'దొంగ లెక్కలు పక్కన పెట్టి నోటిఫికేషన్లు ఇవ్వండి'

by Disha Web Desk 2 |
దొంగ లెక్కలు పక్కన పెట్టి నోటిఫికేషన్లు ఇవ్వండి
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యార్థుల ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో నిరుద్యోగం పట్టిపీడిస్తోదని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దొంగ లెక్కలు పక్కన పెట్టి పీఆర్సీ కమిటీ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రస్తానం యాత్రలో భాగంగా ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష 33వ వారం అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అంబట్‌పల్లిలో కొనసాగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల విషయంలో కేసీఆర్ సర్కార్ అబద్ధాలు చెబుతోందని అన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగులు లేరని ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలన్నారు. కొత్త జిల్లాలోని ఖాళీలను సైతం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

Next Story