ప్రైవేట్ ఫంక్షన్‌లో వైఎస్ జగన్, కేటీఆర్.. ఫొటోస్ వైరల్

by Gantepaka Srikanth |

ప్రైవేట్ ఫంక్షన్‌లో వైఎస్ జగన్, కేటీఆర్.. ఫొటోస్ వైరల్

ప్రైవేట్ ఫంక్షన్‌లో వైఎస్ జగన్, కేటీఆర్.. ఫొటోస్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏపీ మాజీ సీఎం జగన్(YS Jagan), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఒకే ఫంక్షన్‌లో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం బెంగళూరులోని ఓ ప్రయివేట్ ఫంక్షన్‌లో ఇద్దరూ పాల్గొన్నారు. పక్క పక్కనే కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఇటీవలే కేసీఆర్‌పై, బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై జగన్ పాజిటివ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందిందని జగన్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధితో చంద్రబాబుకు సంబంధమే లేదని విమర్శించారు. హైటెక్‌ సిటీకి నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌ శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు.


Next Story