అందుబాటులో యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల టికెట్లు

by Disha Web Desk 4 |
అందుబాటులో యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల టికెట్లు
X

దిశ,భువనగిరి రూరల్ : యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల టికెట్లను అందుబాటుల ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరుగే శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరపడానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం తర్వాత ఆలయ మాడవీధుల్లో మొట్టమొదటిసారిగా జరుపబడుతున్న వార్షికళ్యాణంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం శనివారం నుండి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం వారు కళ్యాణ టికెట్టు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ టికెట్లు దేవస్థానం ప్రధాన బుకింగ్ కౌంటర్ వద్ద అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ వార్షిక కళ్యాణ్ టికెట్ ధర రూ.3000 అధికారులు తెలిపారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనదలుచుకున్న భక్తులు టికెట్లు కొనాలని సూచించారు. టికెట్టు తీసుకుంటే ఇద్దరికి ప్రవేశం ఉంటుందని అధికారులు తెలిపారు.


Next Story

Most Viewed