- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రజావాణికి పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు.. ఎందుకంటే?
దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కలెక్టరేట్కు సోమవారం భారీగా మహిళలు తరలివచ్చారు. ఇటీవల అధికారులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను విడుదల చేయగా జాబితాలో పేర్లు లేని వారు సోమవారం ప్రజావాణికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. డబుల్ ఇండ్లు పొందేందుకు తమకు అన్ని రకాలుగా అర్హతలు ఉన్నప్పటికీ లిస్టులో పేర్లు రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
డబుల్ బెడ్ రూమ్ల కోసం వచ్చిన మహిళలతో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గందరగోల పరిస్థితిలు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలను చూసి ఆరా తీసిన జిల్లా కలెక్టర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దరఖాస్తులను ఆర్డీవో కార్యాలయంలో ఇవ్వవలసిందిగా సూచించినట్లు సమాచారం. దీంతో మహిళలు అక్కడి నుండి ఆర్డీఓ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. అద్దె ఇంట్లో ఉంటూ అవస్థలు పడుతున్నామని అధికారులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించలేదని పలువురు మహిళలు ఆరోపించారు.