నన్ను పట్టించుకోవడం లేదు... భర్తను గొంతుకోసి హత్య చేసిన భార్య

by Ajay Maddhiboyina |

నిద్రలో ఉన్న భర్తను భార్య గొంతుకోసి హత్య చేసింది. ఈ దారుణ ఘటన యూపీలోని ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముజఫర్‌నగర్‌లో సంజయ్ కుమార్ అతడి భార్య కవిత నివాసం ఉంటున్నారు.

నన్ను పట్టించుకోవడం లేదు... భర్తను గొంతుకోసి హత్య చేసిన భార్య
X

దిశ, వెబ్ డెస్క్: నిద్రలో ఉన్న భర్తను భార్య గొంతుకోసి హత్య చేసింది. ఈ దారుణ ఘటన యూపీలోని ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముజఫర్‌నగర్‌లో సంజయ్ కుమార్ అతడి భార్య కవిత నివాసం ఉంటున్నారు. అయితే కవిత సంజయ్ కుమార్ రెండో భార్య కాగా ఇప్పటికే అతడికి మరో మహిళతో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో తనను పట్టించుకోకుండా మొదటి భార్యనే పట్టించుకుంటున్నాడని గత కొద్దిరోజులుగా కవిత భ‌ర్త‌తో గొడ‌వ ప‌డుతోంది.

ఈ క్ర‌మంలోనే ఈ నెల 29న రాత్రి భ‌ర్త నిద్రిస్తున్న స‌మ‌యంలో అత‌డి గొంతు కోసి హ‌త్య చేసింది. మృతుడి తండ్రి భోపాల్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసింది నింధితురాలిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచార‌ణ‌లో త‌న‌ను నిర్ల‌క్ష్యం చేసినందుకే హ‌త్య చేసిన‌ట్టు అంగీక‌రించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మృతుడి మొద‌టి భార్య అత‌డి స్వ‌గ్రామం తాండా మ‌జ్రాలో ఉంటుండ‌గా రెండో భార్య ముజ‌ఫ‌ర్‌నగర్‌లో ఉంటుంది.

Next Story