సిట్ విచారణ అంటే ఎందుకు అంత భయం? : మంత్రి అడ్లూరి

by Ramesh Naini |   (  Updated:2026-02-01 11:23:17  IST  )

సిట్ విచారణ అంటే ఎందుకు అంత భయం? అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌‌, సిట్ అధికారుల విచారణపై మంత్రి స్పందించారు.

సిట్ విచారణ అంటే ఎందుకు అంత భయం? : మంత్రి అడ్లూరి
X

దిశ, డైనమిక్ బ్యూరో: సిట్ విచారణ అంటే ఎందుకు అంత భయం? అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌‌, సిట్ అధికారుల విచారణపై మంత్రి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కాబట్టే సెంటిమెంట్‌తో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధించాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే ఈ రెండేళ్లు మీరు రోడ్డు మీద తిరిగేవాళ్లు కాదని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు చేసిన పాపాలకు మూల్యం చెల్లుంచుకోవాలని, చట్టం తన పని తాను చేసుకంటూ పోతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ ప్రారంభమైంది. సిట్ నోటీసుల నేపథ్యంలో నంది నగర్ నివాసంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ప్రారంభమైంది. ఫోన్ ట్యాపింగ్ అంశంపై మొత్తం 15 మంది అధికారుల బృందం ఆయనను ప్రశ్నిస్తోంది.

MORE NEWS : కుటుంబాలకు కుటుంబాలు నాశనం చేశారు.. బీఆర్ఎస్‌పై రెచ్చిపోయిన మహేశ్ కుమార్ గౌడ్

Next Story