కర్ణాటక వేరు.. తెలంగాణ వేరు.. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం: సుధీర్ రెడ్డి

by Disha Web Desk 19 |
కర్ణాటక వేరు.. తెలంగాణ వేరు.. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం: సుధీర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నూరు స్థానాలకు పైగా విజయం సాధిస్తామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సచివాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఒక్క రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అంతట వస్తారా..? కాంగ్రెస్ ఎన్నో రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పాదయాత్రలో ఉన్న రాహుల్ గాంధీ ఎందుకు వెళ్లలేదని, కాంగ్రెస్ తరుపున ప్రచారం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. గుజరాత్‌లో ఎన్నికలు జరిగినా అక్కడికి పోలేదన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు వేరు.. తెలంగాణ వేరు అని, అక్కడి ప్రభావం తెలంగాణలో ఉండదని స్పష్టం చేశారు. మంత్రి కన్స్ట్రక్షన్స్‌కి మంత్రి కేటీఆర్‌కి సంబంధం లేదన్నారు. ఓన్లీ డబ్బుల కోసమే రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.



Next Story

Most Viewed