సీఎంతో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు డైరెక్టర్ భేటీ.. ఆ ప్రాజెక్టుల కోసమేనా?

by Disha Web Desk 14 |
సీఎంతో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు డైరెక్టర్ భేటీ.. ఆ ప్రాజెక్టుల కోసమేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు డైరెక్టర్ జనరల్ పాండియన్ ఇవాళ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ ఏరియాను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధికి ప్రణాళికలు వేసినట్లు పేర్కొన్నారు. నదిని సంరక్షిస్తూ, నదీ జలాలను సుస్థిరంగా ఉండటం ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనముండే విధంగా ఈ ప్రాజెక్టును మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దే విధంగా పనులు చేపట్టనున్నట్లు సీఎం అన్నారు. అలాగే మూసీ నది అభివృద్ధిలో పర్యావరణాన్ని కాపాడుతూ, కాలుష్య రహితంగా, సహజ వనరులకు విఘాతం కలగకుండా అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు.

ఆ ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించాలి

సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే హైదరాబాద్ లోని రెండో దశలో చేపట్టే మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు, రాష్ట్రంలో శిక్షణ, సాంకేతిక నైపుణ్యాలు అందించే శిక్షణ సంస్థలు ఏర్పాటుకు సహకరించాలని, ఆసుపత్రుల నిర్మాణానికి, విద్యాసంస్థల హాస్టల్ బిల్డింగ్స్ నిర్మాణానికి, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణాలకు, అలాగే వేస్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించాలన్నారు. అనంతరం పాండియన్ మాట్లాడుతూ రాష్ట్ర పురోభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed