CM Revanth Reddy : ట్రాన్స్ జెండర్లకు గౌరవనీయ జీవితాన్ని కల్పిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

by M.Rajitha |
CM Revanth Reddy : ట్రాన్స్ జెండర్లకు గౌరవనీయ జీవితాన్ని కల్పిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా జరుపుతున్న ప్రజా పాలన విజయోత్సవాల్లో(Triumph of public governance) శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) పాల్గొన్నారు. నేడు తెలంగాణ పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ట్రాన్స్ జెండర్ల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంతో గౌరవం ఉందన్నారు. వారిని అన్ని రంగాల్లో ప్రోత్సాహిస్తామని, సమాజంలో గౌరవనీయమైన జీవితాన్ని కల్పిస్తామని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణలో 54 మంది ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు ఇచ్చామని, దేశంలో ఇంతవరకు ఎవరూ సాహసించని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇకపై ట్రాన్స్ జెండర్లు ఎవరూ అడుక్కో కూడదని.. వారి ఆర్థికస్థితి మెరుగు పరిచేందుకు మరిన్ని పథకాలు తీసుకు వస్తామని తెలియజేశారు. అలాగే ట్రాన్స్ జెండర్ల కోసం భారీ సంఖ్యలో 'మైత్రి ట్రాన్స్ క్లినిక్స్' ప్రారంభించామని తెలియ జేశారు.

Advertisement

Next Story

Most Viewed