సన్మానించేందుకు శాలువా తెచ్చాం.. కేసీఆర్ ఎక్కడ: బండి సంజయ్

by Sathputhe Rajesh |

ప్రధాని కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదో చెప్పాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు.

సన్మానించేందుకు శాలువా తెచ్చాం.. కేసీఆర్ ఎక్కడ: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదో చెప్పాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. పరేడ్ గ్రౌండ్ సభ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కోసం ప్రోటోకాల్ ప్రకారం చెయిర్ వేశామన్నారు. సన్మానించేందుకు శాలువా కూడా తెచ్చామన్నారు. ప్రధాని ప్రొగ్రాంకు సీఎం ఎందుకు రాలేదని సీఎం షెడ్యూల్ వెంటనే బయట పెట్టాలని కోరారు. దీనికి సీఎం జ్వరం వచ్చిందని అంటారా? కోవిడ్ వచ్చిందంటారా అంటూ సెటైర్ వేశారు. సీఎం స్టేట్ డెవలప్‌మెంట్‌కు సహకరించడం లేదన్నారు.

Next Story