బీఆర్​ అంబేద్కర్​ ఆశ‌యాల‌కు అనుగుణంగా పనిచేస్తున్నాం : మంత్రి పొంగులేటి

by Muthe.Rajitha |

డాక్టర్ ​బీఆర్​ అంబేద్కర్ ​ఆశ‌యాల మేర‌కు స‌మాన‌త్వం, సామాజిక న్యాయం ల‌క్ష్యాల‌కు అనుగుణంగా త‌మ ప్రభుత్వం ప‌నిచేస్తుంద‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు.

బీఆర్​ అంబేద్కర్​ ఆశ‌యాల‌కు అనుగుణంగా పనిచేస్తున్నాం : మంత్రి పొంగులేటి
X

దిశ, తెలంగాణ బ్యూరో : డాక్టర్ ​బీఆర్​ అంబేద్కర్ ​ఆశ‌యాల మేర‌కు స‌మాన‌త్వం, సామాజిక న్యాయం ల‌క్ష్యాల‌కు అనుగుణంగా త‌మ ప్రభుత్వం ప‌నిచేస్తుంద‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. అంబేద్కర్ ​క‌ల‌లుగన్న సమాజాన్ని నిర్మించేందుకు త‌మ ప్రభుత్వం కృషి చేస్తుంద‌న్నారు. ఈనెల 14వ తేదీన‌ అంబేద్కర్ జ‌యంతి సంద‌ర్భంగా ఎస్సీ కార్పొరేష‌న్ మాజీ ఛైర్మన్​ పిడ‌మ‌ర్తి ర‌వి, అంబేద్కర్​ ఉత్సవాల క‌మిటీ ఛైర్మన్​ డాక్టర్​ వీసాల మ‌ల్లేష్ ఆధ్వర్యంలో జై భీమ్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి సంబంధించిన వాల్ పోస్టర్​ను గురువారం నాడు మంత్రి పొంగులేటి ఆవిష్కరించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ డాక్టర్​ బీఆర్ ​అంబేద్కర్​ జ‌యంతి సంద‌ర్భంగా సాయంత్రం 5 గంట‌ల‌కు హైదరాబాద్​ న‌గ‌రంలో నిర్వహించే సూటు- బూటు ర్యాలీని జ‌య‌ప్రదం చేయాల‌ని అన్నారు. బ‌షీర్ బాగ్‌లోని బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ విగ్రహం నుంచి సచివాలయం సమీపంలోని 125 అడుగుల అంబేద్కర్​ విగ్రహం వ‌ర‌కు ర్యాలీ జ‌రుగుతుందని మంత్రి తెలిపారు. ఈ పోస్టర్​ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేష‌న్ మాజీ ఛైర్మన్​ పిడ‌మ‌ర్తి ర‌వి, అంబేడ్కర్​ఉత్సవాల కమిటీ ఛైర్మన్​ వీసాల మ‌ల్లేష్‌, కో ఆర్డినేట‌ర్ రాపోలు రాములు, క‌న్వీన‌ర్లు బొమ్మర స్టాలిన్‌, గ‌జ్జల మ‌ల్లిఖార్జున్‌, వ‌ర‌ల‌క్ష్మి , బోరెళ్లి సురేష్ త‌ద‌త‌రులు పాల్గొన్నారు.

Next Story