ఇందిరాగాంధీనే సెక్యూరిటీ కాపాడలేకపోయింది.. అసదుద్దీన్‌కు సంచలన వార్నింగ్

by Disha Web Desk 4 |
ఇందిరాగాంధీనే సెక్యూరిటీ కాపాడలేకపోయింది.. అసదుద్దీన్‌కు సంచలన వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో అసదుద్దీన్ ఒవైసీకి సామాజిక కార్యకర్త మహమ్మద్ సలీం సంచలన వార్నింగ్ ఇచ్చాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను వేధించొద్దని కోరాడు. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అని హెచ్చరించాడు. యూపీలో అతీక్ అహ్మద్ లాంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఇందిరా గాంధీనే భద్రతా సిబ్బంది కాపాడలేకపోయారని సామాజిక కార్యకర్త మహమ్మద్ సలీం తీవ్ర హెచ్చరిక జారీ చేశాడు.

కాగా గతంలో యూపీలోని మేరట్ జిల్లా కిథౌర్‌లో ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపి హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే ఎంఐఎం చీఫ్ టార్గెట్‌గా తాజా వార్నింగ్ పతంగి పార్టీలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ హెచ్చరికపై ఎంఐఎం రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. పోలీసులకు ఫిర్యాదు అంశంలో క్లారిటీ రావాల్సి ఉంది.



Next Story

Most Viewed