లారీ ఢీ కొని మ‌హిళ‌కు తీవ్ర గాయాలు

by Nallavelli.Anjaneyulu |

లారీ ఢీ కొని మ‌హిళకు తీవ్ర గాయాలైన సంఘ‌ట‌న మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది.

లారీ ఢీ కొని మ‌హిళ‌కు తీవ్ర గాయాలు
X

దిశ‌, ఎల్క‌తుర్తి : లారీ ఢీ కొని మ‌హిళకు తీవ్ర గాయాలైన సంఘ‌ట‌న మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై అక్కినేప‌ల్లి ప్ర‌వీణ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్ మండ‌లం కనుకుల గిద్ద గ్రామానికి చెందిన తోక‌ల ప్ర‌భాక‌ర్ రెడ్డి, రేణుక‌లు క‌లిసి ప‌ని మీద హ‌న్మ‌కొండ‌కు వెళ్తున్న క్ర‌మంలో వెనుక నుంచి వ‌స్తున్న లారీ ఢీ కొట్ట‌డంతో రేణుక‌కు తీవ్ర గాయాల‌య్యాయి. సంఘ‌ట‌న స్థలానికి ఎస్సై వెంట‌నే చేరుకొని ఆమెను స్వ‌యంగా 108 వాహ‌నం ద్వారా వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలిపారు.

Next Story