వాగులో మ‌హిళ‌ మృత‌దేహం ల‌భ్యం..

by Bhanu |

ఇంట్లో నుండి బ‌హిర్బుమి కొర‌కు వెల్లిన మ‌హిళ మృత‌దేహం వాగులో ల‌భించిన ఘ‌ట‌న నూగూరు వెంక‌టాపురం మండ‌ల ప‌రిదిలో చోటు చేసుకుంది.

వాగులో మ‌హిళ‌ మృత‌దేహం ల‌భ్యం..
X

దిశ‌,ఏటూరునాగారం: ఇంట్లో నుండి బ‌హిర్బుమి కొర‌కు వెల్లిన మ‌హిళ మృత‌దేహం వాగులో ల‌భించిన ఘ‌ట‌న నూగూరు వెంక‌టాపురం మండ‌ల ప‌రిదిలో చోటు చేసుకుంది. ఏస్సై క‌థ‌నం మేర‌కు..నూగూరు వెంక‌టాపురం మండ‌లం శివాప‌రం గ్రామానికి చెందిన పానెం ప‌ద్మావతి(42)అనే మ‌హిళ 13.05.2025(మంగ‌ళ‌వారం) రోజున ఉద‌యం 4 నుండి 5 గంట‌ల స‌మ‌యంలో బ‌హిర్బుమి కొర‌కు త‌న ఇంటి వెనక స‌మీపంలో ఉన్న కంక‌ల‌వాగు ఒడ్డుకు వెళ్లి ప్ర‌మాద‌వ‌శాత్తు వాగు నీటిలో ప‌డి చ‌నిపోయిన‌ట్లు మృతురాలి తండ్రి డ‌ర్ర స‌మ్మ‌య్య ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి మృతురాలి స‌రైన మ‌ర‌ణ కార‌ణములు తెలుసుకొనుట‌కు ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ట్లుగా ఏస్సై తెలిపారు.



Next Story