రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

by Disha Web Desk 11 |
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
X

దిశ, దేవరుప్పుల: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాయని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం మండలంలోని చిన్నమడూర్, కోలుకొండ, కామారెడ్డి గూడెం ఎంపీటీసీ పరిధి గ్రామాల్లోని బీఆర్ఎస్ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన సభల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని మాట్లాడారు.

రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని అన్నారు. పనిచేసే ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కి ప్రజలు అండగా ఉండాలన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు చేసే అసత్య ప్రచారాలను నమ్మొద్దని పార్టీ శ్రేణులు ఆ విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, జడ్పీటీసీ పల్లా భార్గవి సుందర్ రాంరెడ్డి, ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేష్, పీఏసీఎస్ చైర్మన్ లింగాల రమేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్, వంగ పద్మ, వెంకటేశ్వర్లు కూర్నాల రవి, బిల్లా అంజమ్మ, యాదవ రెడ్డి, వర్రె మధు తదితరులు పాల్గొన్నారు.

Next Story