‘వసతి గృహాల్లో పక్కాగా డైట్‌ అమలు చేయాలి’

by velandi.Saikiran |

సాంఘిక సంక్షేమ శాఖ,ఫార్మసీ కాలేజ్, ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

‘వసతి గృహాల్లో పక్కాగా డైట్‌ అమలు చేయాలి’
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ,ఫార్మసీ కాలేజ్ అనంతరం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ విద్యార్థుల మేధస్సును వెలికితీయడానికి నూతన టెక్నాలజీ ఉపయోగించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన డైట్ మెనూ ప్రకారం రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డిజిటల్ తరగతులను ప్రభుత్వం కల్పించినందున ఉపాధ్యాయులు ఈ సాధనాల ద్వారా పిల్లల మేధస్సును వెలికి తీసి వారిని ప్రతి సబ్జెక్టు వారీగా సామర్ధ్యాలను గుర్తించాలన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్, అదనపు కలెక్టర్ వెంట సంబంధిత సిబ్బంది ఉపాధ్యాయులు ఉన్నారు.

Next Story