టీవీఎస్-కారు ఢీ.. వాట‌ర్ మ్యాన్ మృతి

by Ratna Kumari |

టీవీఎస్ పై వెళ్తున్న వ్య‌క్తిని కారు ఢీ కొట్ట‌డంతో వ్య‌క్తి మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న వ‌రంగ‌ల్ జిల్లా వ‌ర్ద‌న్న‌పేట ప‌ట్ట‌ణ ప‌రిధిలో చోటు చేసుకుంది.

టీవీఎస్-కారు ఢీ.. వాట‌ర్ మ్యాన్ మృతి
X

దిశ‌, వ‌ర్ద‌న్న‌పేట : టీవీఎస్ పై వెళ్తున్న వ్య‌క్తిని కారు ఢీ కొట్ట‌డంతో వ్య‌క్తి మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న వ‌రంగ‌ల్ జిల్లా వ‌ర్ద‌న్న‌పేట ప‌ట్ట‌ణ ప‌రిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ కేంద్రానికి చెందిన ఓర్సు మల్లయ్య(50) అనే వ్యక్తి మున్సిపాలిటీ లో వాటర్ మ్యాన్ గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో త‌న టీవీఎస్ పై కార్యాలయానికి వస్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story