బయ్యారంలో 8 సీమ పందులను ఎత్తుకెళ్లిన దొంగలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-08-18 06:19:36  IST  )

మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో దొంగలు రెచ్చిపోయారు....

బయ్యారంలో 8 సీమ పందులను ఎత్తుకెళ్లిన దొంగలు
X

దిశ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో దొంగలు రెచ్చిపోయారు. ఎస్సీ కాలనీ దామర చెరువు కట్ట వద్ద పెంచుతున్న 8 సీమ పందులను ఎత్తుకెళ్లారు. రాత్రి సమయంలో ఆటోలో వెళ్లి పందులను చోరీ చేశారు. దీంతో పందుల పోషణదారుడు కొమిరె స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.4 లక్షల విలువైన పందులను దొంగలు తీసుకెళ్లినట్లు తెలిపారు. నిందితులను గుర్తించి తమకు న్యాయం చేయాలని కోరారు.

Next Story