చెప్పు పోయిందని ట్విటర్‌లో ఫిర్యాదు.. పోలీసులు ఏం చేశారంటే?

by Kodari Anjali |   (  Updated:2023-04-02 10:16:11  IST  )

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

చెప్పు పోయిందని ట్విటర్‌లో ఫిర్యాదు.. పోలీసులు ఏం చేశారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ ఘన్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు గురువారం హైదరాబాద్‌కు వెళ్లేందుకు కాకతీయ ప్యాసింజర్ ట్రైన్ ఎక్కుతుండగా అతడి చెప్పు జారి కిందపడిపోయింది. దీంతో అతడు స్టేషన్‌లో తన చెప్పు పడిపోయిందని ట్విట్టర్ వేదికగా రైల్వే పోలసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి స్పందించిన కాజీపేట రైల్వే పోలీసులు ప్రయాణికుడు చెప్పిన వివరాల ప్రకారం చెప్పును కనుగొని శనివారం అతడి అప్పగించినట్లు తెలిపారు.

Next Story