మాకు రక్షణ కల్పించండి.. ఎస్ఐకి ఫారెస్ట్ అధికారుల వినతి

by Disha Web Desk 13 |
మాకు రక్షణ కల్పించండి.. ఎస్ఐకి ఫారెస్ట్ అధికారుల వినతి
X

దిశ, ములుగు ప్రతినిధి: మాకు రక్షణ కల్పించాలని కోరుతూ వెంకటాపూర్ మండలం లో విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ అధికారులు వెంకటాపూర్ ఎస్ఐ తాజుద్దీన్ కి వినతిపత్రం అందజేశారు. భద్రాద్రిలో ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్‌ను గొత్తి కోయలు హత్య చేసిన దుర్ఘటన నేపథ్యంలో ములుగు ఎఫ్ఆర్ఓ డోలి శంకరయ్య ఆధ్వర్యంలో శనివారం ఫారెస్ట్ అధికారులు వెంకటాపూర్ పోలీస్ స్టేషన్‌‌లో రక్షణ కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా వెంకటాపూర్ మండలంలోని గొత్తికోయల గురించి చర్చించారు. మండలంలో మొత్తం ఎన్ని గొత్తికోయ గుంపులు ఉన్నాయి, వారి పూర్తి వివరాల గురించి చర్చించి, అను నిత్యం విధుల్లో భాగంగా అడవిలోకి వెళ్లే తమకు రక్షణ కల్పించాలని ఫారెస్ట్ అధికారులు కోరారు. ఫారెస్ట్ అధికారులకు రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, అడవిలోకి వెళ్లే ముందు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ ఫారెస్ట్ అధికారులకు సూచించారు. అనంతరం పలు అంశాలపై ఫారెస్ట్, పోలీసులు అధికారులు చర్చించారు.



Next Story

Most Viewed