వరంగల్ మార్కెట్ లో తేజా మిర్చి రికార్డు రూ.20,200 ధ‌ర

by Nallavelli.Anjaneyulu |

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో బుధవారం తేజ‌ రకం మిర్చికి రికార్డు ధర పలికింది.

వరంగల్ మార్కెట్ లో తేజా మిర్చి రికార్డు రూ.20,200 ధ‌ర
X

దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో బుధవారం తేజ‌ రకం మిర్చికి రికార్డు ధర పలికింది. జాఫర్ ఘడ్ మండలం కునూర్ గ్రామానికి చెందిన సమ్మిరెడ్డి రైతు తెచ్చిన ఈ రకం మిర్చికి క్వింటాలు కు 20,200 రూపాయలు పెట్టి వ్యాపారులు కోనుగొలు చేశారు. ఈ మార్కెట్ లో 2023 తరవాత ఈ రకం మిర్చికి ఇదే అత్య‌ధిక ధ‌ర కావ‌డం విశేషం. గడిచిన నెల రోజులుగా రైతులు కొత్త మిర్చితో పాటు పాత మిర్చిని తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్నారు. ప్రతి రోజు వంద నుంచి రెండు వందల క్వింటాళ్ల‌ వరకు మిర్చి మార్కెట్ కు వస్తోంది.

Next Story