ఆయుష్‌ పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ షురూ

by Web Desk |
ఆయుష్‌ పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ షురూ
X

దిశ, వరంగల్ ప్రతినిధి : రాష్ట్రంలో ఆయూష్ పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి హెల్త్​యూనివర్శిటీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఐఏపీజీఈటీ-2021 పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులుగా ప్రకటించింది. పీజీ ఆయుర్వేదం, హోమియో, యునానీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 10న ఉదయం 6 గంటల నుంచి 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం యూనివర్శిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు.



Next Story

Most Viewed