అదుపుతప్పి బ్రిడ్జిపై నుండి పడిన కారు.. వ్యక్తి మృతి

by Disha Web Desk 13 |
అదుపుతప్పి బ్రిడ్జిపై నుండి పడిన కారు.. వ్యక్తి మృతి
X

దిశ, ఏటూరు నాగారం: అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కారు పడటంతో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందిన ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం బోర్ నరసాపురం కొత్త బ్రిడ్జి వద్ద జరిగింది. అదుపుతప్పి ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుండి కింద గల వాగులో కారు పడిపోయింది. ఈ ప్రమాదంలో మంగపేట మండలానికి చెందిన నారా సందీప్ బైక్ మెకానిక్ అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story