విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించడమే లక్ష్యం

by velandi.Saikiran |

విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించడమే లక్ష్యం అని శ్రీ వాత్సల్య హై స్కూల్ డైరెక్టర్లు తెలిపారు.

విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించడమే లక్ష్యం
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్: విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించడమే లక్ష్యం అని శ్రీ వాత్సల్య హై స్కూల్ డైరెక్టర్లు తెలిపారు. ఆరేపల్లి నుంచి హన్మకొండ కు వెళ్ళే ప్రధాన రహదారి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వాత్సల్య హై స్కూల్ ఐఐటి & నీట్ ఫౌండేషన్ ను ఘనంగా ప్రారంభించారు. గురువారం శ్రీ వాత్సల్య హై స్కూల్ ఫౌండర్స్ ఎన్. శ్రీనివాస్, కే. హరి బాబు, బి. సంపత్ రావు, టి. శ్రీధర్ పాల్గొని స్కూల్ ను ప్రారంభించి మాట్లాడుతూ ఇప్పటి నూతన విద్యా విధాన్ని అవలంబిస్తూ టెక్నాలజీతో విద్యార్థులకు విద్యను అందించేందుకు శ్రీ వాత్సల్య పాఠశాలను ప్రారంభించామని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే విధంగా శ్రీ వాత్సల్య హై స్కూల్ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు మేనేజ్మెంట్ కంకణం కట్టుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story