నిరుపేద‌ల‌కు గృహాలు మంజూరు చేయ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

by Ratna Kumari |

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని నీరుకుళ్ల గ్రామానికి చెందిన ఓదెల చిరంజీవి గృహ ప్రవేశానికి హాజరైన హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రాంరెడ్డి నూతన గృహ ప్రవేశానికి హాజరై ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు.

నిరుపేద‌ల‌కు గృహాలు మంజూరు చేయ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం
X

దిశ, ఆత్మకూర్ : హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని నీరుకుళ్ల గ్రామానికి చెందిన ఓదెల చిరంజీవి గృహ ప్రవేశానికి హాజరైన హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రాంరెడ్డి నూతన గృహ ప్రవేశానికి హాజరై ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని జిల్లాలోని మండలంలోని నిరూ పేదలకు ఎక్కడ ఉన్నా గూడు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ‌త బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నట్టేట ముంచిందని.. ఏ ఒక్కరికీ కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయలేదని పేద ప్రజలను హింస గురిచేసిందని ఆయన తెలిపారు.

ప్రజా ప్రభుత్వంలో అస్సలు సిసలైన నిరుపేదలను గుర్తించే విడుదలవారీగా ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసి వారికి నీడ కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొనుగోటి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ బండి సాంబయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం రాజు మాజీ సర్పంచ్, ఉడుత సంగీత, మహేందర్ వార్డ్ నెంబర్ ఎన్నపురెడ్డి, నాగరాజు, సోషల్ మీడియా కన్వీనర్ ఉడుత రాజేందర్, యూత్ ప్రధాన కార్యదర్శి పిట్టల రాజ్ కుమార్, ఉప సర్పంచ్ కిన్నెర ప్రేమ్ చందు, యూత్ నాయకులు దురిశెట్టి శ్రావణ్, రాంబాబు సీనియర్ నాయకులు ఆర్షం కుమారస్వామి పాల్గొన్నారు.

Next Story