ప‌ది మంది ఇంట‌ర్ విద్యార్థులు డిబార్

by Ratna Kumari |   (  Updated:2026-03-04 12:12:52  IST  )

మండ‌ల కేంద్రంలోని మోడ‌ల్ స్కూల్ లో ప‌రీక్ష రాసిన ప‌ది మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. ప్రి

ప‌ది మంది ఇంట‌ర్ విద్యార్థులు డిబార్
X

దిశ‌, ఎల్క‌తుర్తి : మండ‌ల కేంద్రంలోని మోడ‌ల్ స్కూల్ లో ప‌రీక్ష రాసిన ప‌ది మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. ప్రిన్సిపాల్ శ్రీకాంత్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఎస్వీఆర్ క‌ళాశాల‌కు చెందిన 9 మంది విద్యార్థులు, ఎస్వీసీ క‌ళాశాల‌కు చెందిన ఒక విద్యార్థి లో దుస్తుల‌తో చిట్టీలు పెట్టుకుని ప‌రీక్ష కేంద్రానికి వ‌చ్చారు. ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు డైరెక్ట‌ర్ రాఘ‌వ త‌నిఖీలు చేప‌ట్ట‌గా.. వారి వ‌ద్ద చిట్టీలు ల‌భించ‌డంతో 10 మందిని డిబార్ చేస్తున్న‌ట్టు తెలిపారు. అలాగే ఉపాధ్యాయుల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు సిఫార‌సు చేస్తున్న‌ట్టు తెలిపారు.

Next Story