తెలంగాణా రాష్ట్ర హైకోర్టు ఏజీపీ రాధా సందీప్తి రెడ్డి

by Disha Web Desk 23 |
తెలంగాణా రాష్ట్ర హైకోర్టు ఏజీపీ రాధా సందీప్తి రెడ్డి
X

దిశ, వరంగల్ కలెక్టరేట్ : హన్మకొండ జిల్లా సుబేదారి ప్రాంతానికి చెందిన కట్టా రాధా సందీప్తి రెడ్డి తెలంగాణా రాష్ట్ర హైకోర్టు ఏజీపీగా నియమితులయ్యారు. తెలంగాణ సర్కార్ నియమించిన 44 మంది ఏజిపిలలో రాధా సందీప్తి రెడ్డి ఒకరు. ఈమె మూడేళ్ల కాలం పాటు పదవిలో కొనసాగనున్నారు. కట్ట రాధా సందీప్తి రెడ్డి బీటెక్ (సి ఎస్ ఈ), ఎల్ ఎల్ బి, డిప్లొమా ఇన్ పీజీడీసీఎల్ అండ్ ఇన్ఫర్మేషన్ లతో పాటు ఎల్ఎల్ఎం లో గోల్డ్ మోడల్ సాధించారు.

కాకతీయ యూనివర్సిటీలో క్రిమినల్ లా లో గోల్డ్ మెడల్ సాధించి చదువుల సరస్వతి గా గుర్తింపు పొందారు. రాధా సందీప్తి రెడ్డిది జఫర్గడ్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వీరి కుటుంబం ముప్పై ఏళ్ల క్రితం వరంగల్ జిల్లాకు వచ్చి స్థిరపడ్డారు. ఏజీపీ గా నియమితులైన కట్టా రాధా సందీప్తి రెడ్డి కి బంధు, మిత్రులు సహా ఓరుగల్లు వాసులు శుభాభినందనలు తెలియజేశారు.

Read More..

రాత్రికి రాత్రే కల్నల్ వీబీబి రెడ్డి విగ్రహం ఏర్పాటు

Next Story

Most Viewed