ఇంటి స్థ‌లం పోతుందనే భ‌యంతో ఆత్మహత్య

by Disha Web Desk 4 |
ఇంటి స్థ‌లం పోతుందనే భ‌యంతో ఆత్మహత్య
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: ఇంటి స్థ‌లం పోతోంద‌నే భ‌యంతో వల్లపు చంద్రయ్య అనే వ్య‌క్తి రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘ‌ట‌న హ‌న్మ‌కొండ జిల్లా కాజీపేట మండ‌లం మ‌డికొండ‌- అయోధ్య‌పురం గ్రామాల మ‌ధ్య ఉన్న రైల్వే ట్రాక్‌పై గురువారం ఉద‌యం జ‌రిగింది. మెట్టు రామ‌లింగేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో కొంత‌కాలంగా గుడిసెలు వేసుకుని నివ‌సిస్తున్న వారిని ఇటీవ‌ల దేవాదాయ శాఖ అధికారులు బ‌ల‌వంతంగా ఖాళీ చేయించేందుకు య‌త్నించారు. గుడిసె వాసుల నుంచి ప్ర‌తిఘ‌ట‌న ఎదురుకావ‌డంతో అధికారులు కూడా వెనుదిరిగారు. అయితే అధికారులు గుడిసెలు ఖాళీ చేయించేందుకు ప్ర‌క్రియ‌ను ముందుకు తీసుకెళ్లేందుకు య‌త్నిస్తున్నారు. ఈమేర‌కు అంద‌రికీ ఆదేశాలు జారీ చేయ‌డంతో పోలీసుల‌తో కూడా చెప్పించారు. ఈ క్ర‌మంలోనే ఇన్నాళ్లు గుడిసె ఆధారంగా జీవిస్తున్న చంద్ర‌య్య తీవ్ర మ‌న‌స్తాపం చెందాడు. గుడిసె స్థ‌లం చేజారిపోతోంద‌ని ఆవేద‌న‌కు లోనై గురువారం ఉద‌యం రైలు కింద‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి రైల్వే పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed