భూపాల‌ప‌ల్లిలో స‌ర్వ‌త్రా అవినీతే : బీజేపీ రాష్ట్ర అధికారి ప్ర‌తినిధి కీర్తి రెడ్డి..

by Disha Web Desk 20 |
భూపాల‌ప‌ల్లిలో స‌ర్వ‌త్రా అవినీతే : బీజేపీ రాష్ట్ర అధికారి ప్ర‌తినిధి కీర్తి రెడ్డి..
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : భూపాలపల్లి నియోజక వర్గం మొత్తం అవినీతి పనులతో నడుస్తోంద‌ని బీజేపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి చందుపట్ల కీర్తి రెడ్డి ఆరోపించారు. రెండు రోజులుగా భూపాల‌ప‌ల్లి మునిసిపాలిటీలో జ‌రుగుతున్న రాజ‌కీయ తంతే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. భూపాలపల్లి బీజేపీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు సామల మధూసూధన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధ‌వారం పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో జిల్లా అధ్యక్షులు కన్నం యుగేందర్‌తో క‌లిసి కీర్తి రెడ్డి మాట్లాడారు. రమణారెడ్డి వర్గానికి చెందిన మున్సిపల్ చైర్‌ప‌ర్స‌న్‌, వైస్ చైర్మన్ల అవినీతి పనులను ఆ పార్టీ కౌన్సిల‌ర్లే ఈస‌డించుకుంటున్నార‌ని అన్నారు.

పాల‌క వ‌ర్గంలోని నిర్ణ‌యాల్లో త‌మ‌కు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా జ‌రిగిపోతున్నాయ‌ని దేనికి సంకేత‌మ‌ని అన్నారు. డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌లో అక్ర‌మాలు జ‌రిగాయంటూ కౌన్సిల‌ర్లు బాహాటంగానే చెబుతున్నార‌ని, పండగ ఉత్సవాల్లో, బ్లీచింగ్ పౌడర్ల కొనుగోలులో, సిబ్బంది జీతాల్లో, సామగ్రి కొనుగోళ్ల‌లో ఇలా ప్ర‌తీదాంట్లో అవినీతి పాల్ప‌డుతున్నా దౌర్బాగ్యులంటూ ఆరోపించారు. ఎమ్మెల్యే రమణారెడ్డి వర్గానికి చెందిన మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లు త‌మ వారికే డబుల్ బెడ్ రూంలను కేటాయించడం సిగ్గుచేటని అన్నారు. అందరికీ న్యాయం జ‌రిగే వ‌ర‌కు బీజేపీ త‌రుపున ఖ‌చ్చితంగా పోరాడుతామ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి పాపన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎరుకల గణపతి, జిల్లా నాయకులు రామ్ రెడ్డి, కోరే సుధాకర్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపల్లి కుమార్, జిల్లా ప్రచార కార్యదర్శి మండల రఘునాథ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

Next Story