సావిత్రిబాయి పూలేకి ఘన నివాళి

by Dishafeatures2 |
సావిత్రిబాయి పూలేకి ఘన నివాళి
X

దిశ, ఖానాపూర్: భారత దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 126 వర్ధంతి సందర్భంగా ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. నర్సంపేట ఎంఈవో రత్నమాల, ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ మాట్లాడుతూ.. భారతదేశంలోని స్త్రీలకు సమాన హక్కులు కల్పించాలని, స్త్రీ జాతిలో చైతన్యంతో పాటు విద్యను అందించిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని కొనియాడారు.

ఆమె భర్త జ్యోతిరావు పూలే వద్ద చదువు నేర్చుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలతో పాటు మహిళలకు విద్య నేర్పించిన గొప్ప నాయకురాలు సావిత్రిబాయి పూలే అన్నారు. ప్రతి ఒక్కరు సావిత్రిబాయి పూలే ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ నాయకులు భరత్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Next Story