హాసన్ పర్తిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

by Nallavelli.Anjaneyulu |

హ‌నుమ‌కొండ జిల్లా హాసన్ పర్తిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద చెరువు సమీపంలో ఎస్సార్ కాలేజ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

హాసన్ పర్తిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్: హ‌నుమ‌కొండ జిల్లా హాసన్ పర్తిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద చెరువు సమీపంలో ఎస్సార్ కాలేజ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతులు సుప్రతిక, అక్రమ్ గా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Next Story