లక్ష్మీ బ్యారేజ్ (మేడిగడ్డ) వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి

by Kodari Anjali |

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీ బ్యారేజ్ (మేడిగడ్డ) వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది

లక్ష్మీ బ్యారేజ్ (మేడిగడ్డ) వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి
X

దిశ, మహదేవపూర్: ​ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీ బ్యారేజ్ (మేడిగడ్డ) వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ రోజు (మంగళవారం) ఉదయం 9:00 గంటల సమయానికి అందిన వివరాల ప్రకారం.. బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి మట్టం 100.00 మీటర్లు కాగా, ప్రస్తుతం +90.80 మీటర్ల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది.

బ్యారేజ్ మొత్తం నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు

​ప్రస్తుతం బ్యారేజ్‌కు 1,22,440 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో (వరద నీరు) వస్తోంది. వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. అధికారులు బ్యారేజ్‌కు ఉన్న మొత్తం 85 గేట్లను పూర్తిగా ఎత్తివేయగా ​గోదావరి నది పూర్తిగా కిందకి కొనసాగుతోంది. ఎక్కడా నీటిని నిల్వ చేయకుండా వచ్చిన వరదను వస్తున్నట్లుగా దిగువకు వదులుతున్నారు. ​పరిస్థితిని నీటిపారుదల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Next Story