రైలు ఢీకొని వృద్ధురాలు మృతి..

by Disha Web Desk 11 |
రైలు ఢీకొని వృద్ధురాలు మృతి..
X

దిశ, నెక్కొండ: రైల్వే గేట్ దాటుతున్న క్రమంలో రైలు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మడిపల్లి గ్రామ సమీపంలో జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి 9 గంటల 45 నిమిషాల సమయంలో భూక్యతండా(మడిపల్లి)కు చెందిన భూక్య వాలి(83), భర్త భీక మడిపల్లి సమీపంలో గేటు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టడం వల్ల భూక్య వాలి తల, మొండెం వేరై అక్కడికక్కడే మృతిచెందింది. శవపరీక్ష అనంతరం మృతురాలి బంధువులకు మృతదేహాన్నీ అప్పగించినట్లు రైల్వే పోలీస్ పి.రాజు తెలిపారు.

Next Story

Most Viewed