- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్ లో రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించిన అధికారులు
హన్మకొండ జిల్లా కాజీపేట్ మండలం శాయంపేట్ గ్రామ పరిధిలోని సర్వే నెం. 23లో ఉన్న విలువైన ప్రభుత్వ బంచరాయి భూమిని అధికారులు రక్షించారు.

కొంతమంది వ్యక్తులు సంబంధిత అధికారుల నుండి ఎటువంటి ముందస్తు అనుమతులు పొందకుండా దేవాలయం పేరుతో ఆ విలువైన ప్రభుత్వ భూమిని చట్టవిరుద్ధంగా ఆక్రమించేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రెవెన్యూ శాఖ అధికారులు, పోలీస్ శాఖ, జి.డబ్ల్యూ.ఎం.సి డీఆర్ఎఫ్ బృందం, టౌన్ ప్లానింగ్ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టి ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా రక్షించారు. సంబంధిత వ్యక్తులు ప్రభుత్వ భూమిపై అక్రమ కబ్జాకు యత్నించడమే కాకుండా, అక్కడ వివాదాస్పద పరిస్థితులు సృష్టించి ప్రజలకు అసౌకర్యం కలిగించిన నేపథ్యంలో, వారి పై సుబేదారి పోలీస్ స్టేషన్లో ఈ నెల 19న కేసు నమోదు చేశామన్నారు. ఇకముందు ఎవరైనా ప్రభుత్వ భూములపై ఆక్రమణలు, అన్యాక్రాంత చర్యలు లేదా చట్టవిరుద్ధ నిర్మాణాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని కాజీపేట తహశీల్దార్ రాజు హెచ్చరించారు. ఈ భూమి త్వరలో ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తారని తెలిపారు.






