కాంగ్రెస్ తోనే పేదల ఇంట్లో వెలుగు.. ఎమ్మెల్యే సీతక్క

by Dishafeatures2 |
కాంగ్రెస్ తోనే పేదల ఇంట్లో వెలుగు.. ఎమ్మెల్యే సీతక్క
X

దిశ, హన్మకొండ: కాంగ్రెస్ తోనే పేదల ఇంట్లో వెలుగు అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. హన్మకొండలోని 6వ డివిజన్ లో హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి లష్కర్ బజార్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండావిష్కరించి పాదయాత్రను ప్రారంభించారు. రాహుల్ గాంధీ సందేశాన్ని ఇంటింటికి తిరుగుతూ కరపత్రాల రూపంలో ప్రచారం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతిలో ఎన్ని సమస్యలు పరిష్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాలి డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు జరిగిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు విసుగుచెంది ప్రతిఫలం తీర్చుకునే రోజులు ముందు ఉన్నాయని అన్నారు. ఖాళీ స్థలం కంటికి కనిపిస్తే కబ్జా చేయడం, ఎదురు తిరిగితే దాడులు చేయడం, లేదంటే బెదిరించడం అధికార పార్టీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్యగా మారిందని ఆరోపించారు. పాదయాత్ర కమ్మరి వాడ, మార్కెట్ సెంటర్ - వెంకటేశ్వర మెడికల్ షాప్, పద్మశాలి వాడ, గణేష్ నగర్ - బొక్కల గడ్డ, ఈద్గా మీదుగా సాగి సిక్కువాడ-కిషన్ పుర వద్ద ముగిసింది. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Next Story