బీజేపీ పై తీవ్రవిమర్శలు చేసిన ఎమ్మెల్యే..

by Disha Web Desk 20 |
బీజేపీ పై తీవ్రవిమర్శలు చేసిన ఎమ్మెల్యే..
X

దిశ, భీమదేవరపల్లి : వచ్చే ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ లేకుండా పోతుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని ముల్కనూర్ గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మార్పాటి మహేందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు నాశనం చేసేందుకే బీజేపీ టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీలు చేపిస్తుందని విమర్శించారు. గ్రూప్స్ పేపర్ లీకేజీల్లో కూడా బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు.

పేపర్ లీకేజీల్లో బండిసంజయ్ హస్తం లేకపోతే పోలీసులకు ఫోన్ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. బండి సంజయ్ పోలీసులకు ఫోన్ ఇవ్వాలంటే భయపడుతున్నాడని అందులో ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం చేసే పని ఎక్కడ బయటపడుతుందోనని అందుకే ఫోన్ ఇవ్వడం లేదన్నారు. మరో నెల రోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తవుతుందని, పదికిలోమీటర్ల ఆనకట్ట పూర్తిచేసి కేవలం 300 మీటర్ల కట్టపూర్తి అవగానే ప్రాజెక్టులోకి నీళ్లు విడుదల చేస్తామన్నారు. గౌరవెల్లితో హుస్నాబాద్ నియోజకవర్గ సస్యశ్యామలం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, ఎంపీపీ జక్కుల అనిత రమేష్, జడ్పీటీసీ వంగ రవీందర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రాజిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురేందర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed