రైల్వేగూడ్స్ షెడ్ హమాలీలకు అండగా ఉంటా : ఎమ్మెల్యే నరేందర్

by Disha Web Desk 20 |
రైల్వేగూడ్స్ షెడ్ హమాలీలకు అండగా ఉంటా : ఎమ్మెల్యే నరేందర్
X

దిశ, వరంగల్ టౌన్ : కార్మికుడి బిడ్డగా కార్మికుల సంక్షేమం కోసం అవసరం అయితే ఆమరణ దీక్షనైనా చేపడతానని, వరంగల్ తూర్పు రైల్వే గూడ్స్ షెడ్ హమాలీ కార్మికులకు ఎమ్మెల్యే నరేందర్ భరోసా ఇచ్చారు. వరంగల్ లోని రైల్వేగూడ్స్ షెడ్ ను చింతలపల్లికి తరలిస్తున్నారని, తద్వారా 225 మంది జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని హమాలీలు బుధవారం ఎమ్మెల్యే నరేందర్ ను కలిసి తన ఆవేదన వెలిబుచ్చారు.

ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ హమాలీల సమస్య పరిష్కారం కోసం వారికి తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. అవసరమైతే న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడనని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ దిడ్డి కుమారస్వామి, సోమిశెట్టి ప్రవీణ్, జడ్ఆర్సీ మెంబెర్ చింతాకుల సునీల్, యూనియన్ గౌరవ అధ్యక్షులు కక్కే సారయ్య, అధ్యక్షులు అయూబ్ ఖాన్, శివ, రాజశేఖర్, హరి, దేవేందర్ యూనియన్ హమాలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed