నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటా.. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..

by Disha Web Desk 20 |
నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటా.. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..
X

దిశ, వరంగల్ టౌన్ : కేటీఆర్ బహిరంగ సభకు తరలి రావాలని పిలవగానే తన మాటపై వచ్చిన 50 వేల పైచీలుకు మంది నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ తూర్పులో శనివారం మంత్రి కేటీఆర్ రూ.618 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి భారీ బహిరంగ సభ విజయవంతం అయిన సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదివారం ఓసిటీ లోని నూతన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేటీఆర్ ఓరుగల్లు పర్యటన వరంగల్ కు మహర్దశ వచ్చిందని, నియోజకవర్గ రాజకీయానికి దశ దిశ ఇవ్వడం మంచి పరిణామం అన్నారు. బతుకమ్మ, బోనాలు, వాయిధ్యాలు, డప్పు చప్పులతో పెద్ద ఎత్తున కేటీఆర్ కి స్వాగతం పలికి సభ నిర్వహించుకోవడం శుభసూచికం. సభ నిర్వహణ జనసంద్రాన్ని చూసి మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మంచిగా పని చేసుకుంటున్నావ్ అని మంత్రి కితాబు ఇచ్చారు. నియోజకవర్గంలో అందరూ సమిష్టిగా పనిచేసి అభివృద్ధి కార్యాక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవం, సభ నా భూతొ నా భవిష్యత్తులా నిర్వహించామన్నారు.

కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మహిళా నాయకులు, ముఖ్య నాయకులు, డివిజన్ అధ్యక్షులు, ఇంచార్జ్ బాద్యులు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోవు రోజుల్లో అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకొని పోతాంమన్నారు. నియోజకవర్గానికి విచ్చేసి 618కోట్ల పనులను శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన కేటీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రోజు మొత్తము నియోజకవర్గానికి కేటాయించిన మంత్రి కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభించి తమ ఆతిధ్యం స్వీకరించిన మంత్రికి కృతజ్ఞుడిని అన్నారు. కలెక్టర్, పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కార్పొరేటర్లు, మాజీకార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ఇంచార్జ్ బాద్యులు, యూత్ నాయకులు మహిళ నాయకురాలులు, మీడియా ప్రతినిధులు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed