- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

టెస్ట్ image
దిశ, రేగొండ: రేగొండ మండలంలోని చెన్నాపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న మిర్చి తోటలను సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ వర్షాలకు మిర్చిపంటలు దెబ్బతిన్న రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, కృంగిపోవద్దని, ధైర్యంగా ఉండాలన్నారు. నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి నష్టపరిహారం ఇప్పిస్తానని తెలిపారు. ప్రభుత్వం రైతులందరికీ అండగా ఉండి ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు అంకం రాజేందర్, ఎంపీటీసీ శ్రీధర్, రూపిరెడ్డి చంద్రారెడ్డి, ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు రవీందర్ రావు, కొడవంచ ఆలయ చైర్మన్ హింగే మహేందర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు సుధాకర్, రేగొండ టౌన్ అధ్యక్షుడు కోలేపక భిక్షపతి, మాజీ సర్పంచ్ రమేష్, మండల ఉపాధ్యక్షుడు గంపల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.






